‘‘మరో వందేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనివి విజయా వారి చిత్రాలు. మా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ప్రారంభోత్సవానికి ఆ స్టూడియోలో అమ్మోరు విగ్రహం సెట్ వేయించాను. నాగిరెడ్డిగారిని కెమెరా స్విచ్చాన్ చే సి, చక్రపాణిగారిని క్లాప్ ఇవ్వమని అడిగాను. కానీ చక్రపాణిగారు మాత్రం నాగిరెడ్డి హస్తవాసి మంచిది. ఆయననే క్లాప్ ఇవ్వమన్నారు. అలాగే చేశారు. అప్పుడు నాగిరెడ్డిగారు ‘‘ ‘పాతాళభైరవి’ సినిమాలోని పెద్ద విగ్రహం సెట్ కూడా ఇక్కడే వేశాం. ఆ చిత్రంలానే ‘అల్లూరి సీతారామరాజు’ కూడా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి’’ అని హీరో కృష్ణ చెప్పారు.
ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందించే శ్రీ బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ప్రకటించారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా. వెంకటేశ్వరరావులకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డు ప్రదానం చేశారు. సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ- ‘‘విజయా వారి చిత్రాల్లో నటించాక విజయనిర్మల అయ్యాను. ‘షావుకారు జానకి’ చిత్రాన్ని నాగిరెడ్డిగారు తమిళంలో రీమేక్ చేశారు.
అందులో జానకిగారు చేసిన పాత్రను నేనే చేశాను. ఈ సినిమాలో నేను ఎస్వీ రంగారావు పక్కన నటించాలి. కానీ, నేను చాలా పీలగా ఉన్నాననీ, ఆయనకు సరిజోడీగా ఉండనని ఎస్వీఆర్ వేరే అమ్మాయిని తీసుకోమన్నారు. కానీ నాగిరెడ్డిగారు ఎస్వీఆర్గారిని తీసేసి ఆయన పాత్రలో సుబ్బారావుగారిని ఎంపిక చేశారు. ఆయన పట్టుదలకు నిదర్శనం ఇది’’ అని చెప్పారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదును విజయా సర్వీసెస్ విభాగానికి అందజేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘నాగిరెడ్డిగారు మంచి చిత్రాలు తీసి ఉండకపోతే తెలుగు సినిమాకు అంత మంచి చరిత్ర ఉండేదే కాదు. ఈ అవార్డు నాకు ఒక బూస్ట్లా ఉపయోగపడుతుంది’’ అని చిత్రదర్శకుడు సురేందర్రెడ్డి చెప్పారు.
ఈ అవార్డు కమిటీ జ్యూరీ సభ్యుల్లో ఒకరైన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ- ‘‘ఓ నిర్మాతకు సత్కారం చేయడం నిజంగా దేశంలో ఏ సంస్థ చేయలేదు. కానీ విజయా సంస్థ వారు చేయడం, అందులో నాకూ భాగస్వామ్యం కల్పించడం నిజంగా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశానికి ముందు విజయా వారి చిత్రాల్లోని అలనాటి పాటలతో జరిగిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని రావు బాలసరస్వతి, సింగీతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాతే ‘విజయ నిర్మల’ అయ్యా : విజయనిర్మల
Published Sun, Apr 19 2015 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement