తలకోన అడవుల్లో... | Aadi Saikumar and Vedhika New Movie Launch in Hyderabad | Sakshi
Sakshi News home page

తలకోన అడవుల్లో...

Mar 19 2019 12:49 AM | Updated on Mar 19 2019 12:49 AM

Aadi Saikumar and Vedhika New Movie Launch in Hyderabad - Sakshi

కార్తీక్‌ విఘ్నేశ్, వేదిక, ఆది సాయికుమార్, కావ్య వేణుగోపాల్‌

ఆది సాయికుమార్, వేదిక జంటగా కార్తీక్‌ విఘ్నేశ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. నిఖిల్‌తో ‘అర్జున్‌ సురవరం’ చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్‌ బ్యానర్‌పై కావ్య వేణుగోపాల్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్‌ సినిమా, తిరు కుమరన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నాయి.

‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కనున్న చిత్రమిది. చిత్తూరు జిల్లాలోని తలకోనలో ఈ నెల 25న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘రోబో, 2.0’ చిత్రాలకు అసోసియేట్‌ కెమెరామేన్‌గా పనిచేసిన గౌతమ్‌ జార్జ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్‌ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement