కార్గిల్‌లో గెలిచింది మనమే! | we have won the Kargil says farwej musharaf | Sakshi
Sakshi News home page

కార్గిల్‌లో గెలిచింది మనమే!

May 19 2015 1:25 AM | Updated on Sep 3 2017 2:17 AM

కార్గిల్‌లో గెలిచింది మనమే!

కార్గిల్‌లో గెలిచింది మనమే!

కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు.

కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ ‘ద్వితీయశ్రేణి దళాలతో పాటు పాక్ సైన్యం కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించింది.

అక్కడి 5 కీలక వ్యూహాత్మకప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఒక ప్రాంతంలోని కొంత భాగాన్ని భారత్ తిరిగి వెనక్కు తీసుకోలేకపోయింది. మన సైన్యం భారత్‌పై సాధించిన గొప్ప విజయాన్ని మన రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement