భారత్ కన్నా పాకిస్థాన్లో అధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్నాయని స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సిప్రి) వార్షిక నివేదిక తెలిపింది.
లండన్: భారత్ కన్నా పాకిస్థాన్లో అధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్నాయని స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సిప్రి) వార్షిక నివేదిక తెలిపింది. పాక్లో 110 నుంచి 130, భారత్లో 100 నుంచి 120 వార్హెడ్లు ఉన్నట్లు అంచనా.
అమెరికా, రష్యా అణ్వాయుధాలు తగ్గించుకుంటున్నాయని.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాయని సిప్రి వెల్లడించింది. చైనా కూడా అణ్వాయుధాలు పెంచుకుంటోందని తెలిపింది.