తన్నుకున్నారని తరలించారు.. | Over 500 inmates transferred after riot | Sakshi
Sakshi News home page

తన్నుకున్నారని తరలించారు..

Feb 24 2015 8:31 AM | Updated on Sep 2 2017 9:51 PM

అమెరికాలోని ఓ జైళ్లో ఖైదీలంతా ఒక చోట చేరి అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించడమే కాకుండా వాళ్లల్లో వాళ్లు తన్నుకోవడంతో 500మందికి పైగా ఖైదీలను వేర్వేరు జైళ్లకు తరలించారు.

అమెరికాలోని ఓ జైళ్లో ఖైదీలంతా ఒక చోట చేరి అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించడమే కాకుండా వాళ్లల్లో వాళ్లు తన్నుకోవడంతో 500మందికి పైగా ఖైదీలను వేర్వేరు జైళ్లకు తరలించారు. అమెరికాలోని రేమాండ్విల్లే అనే చోట జైళ్లో దాదాపు 2,800మంది ఖైదీలు ఉన్నారు.

గత వారం ఖైదీల్లో వాళ్లల్లో వారికే అనుకోకుండాగొడవలు తలెత్తి ఘర్షణలకు దారి తీసింది. అనంతరం వారు జైలులోని పలు వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసు అధికారులపై తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో  పోలీసులు వివాదానికి కారణమైనవారిని  ప్రశ్నించి చివరికి వారిని టెక్సాస్కు ఇరువైపుల ఉన్న వేర్వేరు జైళ్లలోకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement