శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం | New debris images examined by MH370 search team | Sakshi
Sakshi News home page

శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం

Jun 10 2016 9:02 AM | Updated on Sep 4 2017 2:10 AM

శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం

శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం

అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం మిస్టరీ ఛేదించేందుకు ఆస్ట్రేలియా నిరంతరాయంగా శోధన కొనసాగిస్తుంది.

సిడ్నీ : అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం మిస్టరీ ఛేదించేందుకు ఆస్ట్రేలియా నిరంతరాయంగా శోధన కొనసాగిస్తుంది. అందులోభాగంగా ఇటీవల నూతనంగా దొరికిన శిథిలాలను ఆస్ట్రేలియా శోధన బృందం పరిశీలిస్తుందని ఆ దేశ ట్రాన్స్ఫోర్ట్ సేఫ్టీ బ్యూరో అధికార ప్రతినిధి శుక్రవారం సిడ్నీలో వెల్లడించారు. మెడగాస్కర్లో లభించిన శిథిలాలను ఇప్పటికే పరిశీలించినట్లు చెప్పారు.

ఆస్ట్రేలియాలోని దక్షిణ కోస్తా తీరంలో దొరికిన ఓ శిథిలం పూర్తిగా శిథిలమైందని పేర్కొన్నారు. ఆ మూడు శిథిలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఎనిమిది శిథిలాలు లభించాయని... అవన్నీ పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోనివే అని స్పష్టం చేశారు. వాటిలో ఐదు మాత్రం ఈ విమానానికి చెందినవి అయి ఉండవచ్చు అని అన్నారు. మరో మూడు శిథిలాలను మాత్రం పరీక్ష చేస్తున్నట్లు చెప్పారు.

2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయిన సంగతి తెలిసిందే.ఈ విమాన ఆచూకీ కోసం ఆస్ట్రేలియా శోధన బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement