శ్రీలంక చర్చిలో మోదీ నివాళి | Narendra Modi Visits Bombed Sri Lanka Church | Sakshi
Sakshi News home page

శ్రీలంక చర్చిలో మోదీ నివాళి

Jun 9 2019 2:25 PM | Updated on Jun 9 2019 6:02 PM

Narendra Modi Visits Bombed Sri Lanka Church - Sakshi

కొలంబో: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటించారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ అక్కడి నుంచి బయల్దేరి కొలంబోకు చేరుకున్నారు. శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల బాంబు పేలుళ్ల సంభవించిన కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిను సందర్శించారు. ఈ సందర్భంగా  ఘటనలో మృతి చెందిన లంక పౌరులకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సతో సమావేశం కానున్నారు. కాగీ లంక పర్యటన అనంతరం మోదీ అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement