పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు | Murder case registered against Pakistani PM | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు

Sep 17 2014 2:31 PM | Updated on Sep 2 2017 1:32 PM

పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు

పాక్ ప్రధానిపై హత్యకేసు నమోదు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సహా పలువురు మంత్రులపై అక్కడి పోలీసులు హత్యకేసు నమోదు చేశారు.

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సహా పలువురు మంత్రులపై అక్కడి పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారులను చంపినందుకు ఈ కేసు నమోదైనట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రధానమంత్రి సహా మరో 11 మంది ఉన్నతాధికారులు, హోం మంత్రి, రైల్వే మంత్రి, నగర కమిషనర్, పోలీసు చీఫ్ తదితరులపై హత్య కేసు నమోదు చేయాల్సిందిగా స్థానిక కోర్టు ఒకటి పోలీసులను ఆదేశించింది.

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగిన ప్రదర్శనల సందర్భంగా తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని, దీనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ పాకిస్థాన్ అవామీ తెహరీక్ (పీఏటీ) నాయకుడు తహిరుల్ ఖాద్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో దాదాపు 500 మందికి పైగా మరణించారు. వారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement