ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచదేశాలన్నీ ఏకభావనతో కదలిరావాలనీ ఆ దిశగా భారతదేశం ఎప్పుడూ గట్టిసంకల్పంతో కృషిచేస్తుందని భారత ఉపరాష్ట్రపతి అన్సారీ అన్నారు.
బ్యాంకాక్: ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచదేశాలన్నీ ఏకభావనతో కదలిరావాలనీ ఆ దిశగా భారతదేశం ఎప్పుడూ గట్టిసంకల్పంతో కృషిచేస్తుందని భారత ఉపరాష్ట్రపతి అన్సారీ అన్నారు. తన మూడురోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం బ్యాంకాక్ చేరుకున్నారు. ప్రఖ్యాత చౌలాలాంగ్కార్న్ విశ్వవిద్యాలయంలో అన్సారీ థాయ్మేధావులను, వాణిజ్యవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. దక్షిణచైనా సముద్ర జలాల్లో తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల భారత్ ఆవేదన చెందుతోందన్నారు.