ఖట్మాండు; ఇండియన్‌ ఎంబసీ వద్ద పేలుడు | Explosion Near Indian Embassy In Kathmandu | Sakshi
Sakshi News home page

ఖట్మాండు; ఇండియన్‌ ఎంబసీ వద్ద పేలుడు

Apr 17 2018 9:35 AM | Updated on Apr 17 2018 11:25 AM

Explosion Near Indian Embassy In Kathmandu - Sakshi

ఖట్మాండులోని భారత రాయబార కార్యాలయం వద్ద నేపాల్‌ పోలీసు బలగాలు (ఇన్‌సెట్‌లో ఎంబసీ బిల్డింగ్‌)

ఖట్మాండు: నేపాల్‌ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరత్‌నగర్‌ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు . పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఘటన జరిగిందని, పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైందని, అయితే ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని నేపాల్‌ పోలీసులు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు గల కారణాలను కనిపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారతీయ రాయబార కార్యాలయంలో సాధారణ స్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement