పడవ బోల్తా: 234 మంది గల్లంతు | Boat Carrying 234 Migrants Capsizes Off Libya | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా: 234 మంది గల్లంతు

Aug 24 2014 1:02 PM | Updated on Sep 2 2017 12:23 PM

లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 250 మంది నీట మునిగారని కోస్ట్గార్డ్ ఉన్నతాధికారి వెల్లడించారు.

లిబియా: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 250 మంది నీట మునిగారని కోస్ట్గార్డ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రక్షణ దళం వెంటనే రంగంలోకి దిగి 16 మందిని రక్షించిందని తెలిపారు. 234 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్నవారంతా యూరప్ దేశానికి వలస వెళ్తున్న ఆఫ్రికావాసులను ఉన్నతాధికారి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement