ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక | 7.3-magnitude quake in Indonesia, tsunami warning issued | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక

Nov 15 2014 9:12 AM | Updated on Sep 2 2017 4:31 PM

ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక

ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక

ఇండోనేసియా సముద్ర జలాల్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది.

జకర్తా: ఇండోనేసియా సముద్ర జలాల్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. శనివారం ఉదయం తూర్పు ఇండోనేసియా మలూకు ద్వీపాలు కంపించాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సముద్రంలో 46 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇండోనేసియాతో పాటు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా భూకంప కేంద్రం భారత్కు చాలా దూరంలో ఉందని ఇన్కాయిస్ వెల్లడించింది. భారత్కు సునామీ హెచ్చరికలు లేవని పేర్కొంది.


2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం వల్ల ఆగ్నేయాసియా దేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. 1.70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement