
నలుగురు భారత విద్యార్థులకు హార్వర్డ్ అవార్డులు
పరిశోధనాత్మక వ్యాపార ప్రతిపాదనలు చేసిన నలుగురు భారతీయ విద్యార్థులకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ అవార్డులు లభించాయి. ఈ అవార్డు కింద సుమారు రూ.1.8కోట్లు వీరికి అందజేస్తారు.
న్యూయార్క్: పరిశోధనాత్మక వ్యాపార ప్రతిపాదనలు చేసిన నలుగురు భారతీయ విద్యార్థులకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ అవార్డులు లభించాయి. ఈ అవార్డు కింద సుమారు రూ.1.8కోట్లు వీరికి అందజేస్తారు. ‘సోషల్ ఎంటర్ప్రైజ్’ విభాగంలో హార్వర్డ్లో ఎంబీఏ చదువుతున్న అమృతా సియాగల్, ఒరాకిల్ ఇంజనీర్ క్రిస్టిన్ సుమారు రూ.30 లక్షల బహుమతిని గెలుచుకున్నారు. అర టి చెట్టునార నుండి ‘సాథీ’పేరుతో శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే విధానాన్ని వీరు రూపొందించారు. సౌరభ్ మహాజన్ రూపొందించిన ఇంటిపనికి సహకరించే ‘ఆల్ఫ్రెడ్’ అనే వ్యాపారానికి కూడా రూ.30 లక్షల బహుమతి లభించింది. ద్వితీయ బహుమతిని మీరా మెహతా గెలుచుకోగా, జిమ్ కార్యకలాపాలపై వీడియో రూపొందించిన ప్రీతర్ కుమార్కు 15 లక్షల బహుమతి లభించింది.