వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా గాం ధీ, మనతా బెనర్జీ, జయలలితలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరు సల్పి తిరుగులేని నేతలుగా ఎదిగిన విషయం, 1,600 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల పట్టుదలను మహి ళా కార్యకర్తలు గుర్తు చేసుకోవాలన్నారు.
గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లోని మహిళా విభాగం బాధ్యతలు నిర్వర్తించేవారు ఇల్లిల్లూ తిరిగి కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. మహానేత వైఎస్సార్ మహిళల సాధికారత కోసం పడ్డ కష్టం ఏ ముఖ్యమంత్రీ పడలేదన్నారు. మహిళల అభ్యున్నతి కోసం పావలా వడ్డీ రుణాలు తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కల్యాణ లక్ష్మి పథకం బ్రోకర్ల పాలైందన్నారు. రాష్ట్రంలో మహిళలను జాగృతం చేసేందుకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తీవ్రంగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె. అమృత సాగర్ మాట్లాడుతూ మహిళలు కనిపిస్తే ‘ఈ గ్రామ పంచాయతీ’ల్లో 10 వేల మంది మహిళలకు ఉద్యోగాలు అని మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామ పంచాయతీల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలిచ్చారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ స్నాచర్లు విజృంభిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల కు రక్షణ కరువైందని వాపోయారు.
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకూ స్థానం లేదన్నారు. మహిళలకు మేలు చేసే పథకాలు కేసీఆర్ ఒక్కటి కూడా తీసుకురాలేక పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం శ్యామల, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల మహిళా విభాగాల అధ్యక్షురాళ్లు ఇందిర, బి. పద్మ, పలువురు రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో మహిళలు కీలకంగా మారాలి
Published Fri, Jul 29 2016 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement