బోడుప్పల్: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ యాదవబస్తీకి చెందిన కురకల వెంకటేశ్(45), రుక్కమ్మ దంపతులు. వారికి రాధిక అనే కుమార్తె ఉంది. ఆమెను రాజేశ్ అనే వ్యక్తికి ఇచ్చి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. రాజేశ్, రాధిక మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఈనెల 24న కుమార్తె దగ్గరకు వెంకటేశ్ వెళ్లాడు. అక్కడ మాట మాట పెరిగి అల్లుడు రాజేశ్, వెంకటేశ్కు మధ్య గొడవ జరిగింది. ఇదే సమయంలో రాజేశ్ కుటుంబ సభ్యులు వెంకటేశ్పై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వెంకటేశ్ ఇంటికి వచ్చిన తరువాత ఈనెల 28న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వెంకటేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లుడి కుటుంబం దాడి,మామ ఆత్మహత్య
Published Sat, Apr 30 2016 7:01 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement