రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
హాజరుకానున్న 80,349 మంది
విద్యార్థులు, తల్లిదండ్రుల్లోఆందోళన వద్దు డీఈఓ సోమిరెడ్డి
సిటీబ్యూరో: పాఠ్యాంశాలతో పాటు పరీక్ష విధానంలో మార్పుల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురవకుండా... ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేలా సన్నద్ధం చేశామని హైదారాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి సోమిరెడ్డి తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే నెల 11వ తేదీ వరకు కొనసాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అవసరమైతే ఒక రోజు ముందుగా కేంద్రాన్ని చూసుకుంటే... పరీక్ష రోజున ఆందోళనకు తావుండదన్నారు. ‘పది’ పరీక్షల నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
80 వేల మంది విద్యార్థులు
హైదరాబాద్ జిల్లాలో 80,349 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 66,071 మంది రె గ్యులర్, 14,278 మంది ప్రైవేట్ విద్యార్థులు. వీరికి వేర్వేరుగా 292 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించాం. వారు నిరంతరం కేంద్రాల్లో తనిఖీలు చేపడతారు. ఎక్కడికి వెళ్లేదీ అప్పటికప్పుడే నిశ్చయించుకుంటారు. జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక కేంద్రాలు లేవు. మొత్తం 4,020 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రాన్నీ చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
సౌకర్యాలపై దృష్టి
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్నిచోట్లా ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పూర్తయ్యేవరకు మెడికల్ కిట్తో ఒక ఏఎన్ఏం అక్కడ విధుల్లో ఉంటారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆచుట్టుపక్కల గల జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తామన్న నమ్మకం ఉంది. మారిన సిలబస్, పరీక్షా విధానంపై విద్యా సంవత్సరం మొదటి నుంచీ విద్యార్థులకు అవగాహన కల్పించాం. ఉదయం, సాయంత్రం రెండుపూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.
విద్యార్థులూ ఇవి పాటించండి
పరీక్షకు ముందు రోజు కేంద్రాన్ని ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది.పరీక్ష కేంద్రానికిఅరగంట ముందే చేరుకోవాలి. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహా రం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. ఒకవేళ హాల్టికెట్ పోగొట్టుకున్నా, ఫీజులు చెల్లిం చలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www. bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునితో సంతకం చేయించుకుని విద్యార్థి పరీక్షలకు హాజరుకావచ్చు.
ప్రశాంతంగా రాయండి: కలెక్టర్
పదో తరగతి విద్యార్థులు ఆందోళనకు గురికావద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని హైదరాబాద్ కలెక్టర్ కె. నిర్మల సూచించారు. ఈ పరీక్షలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. పరీక్ష సమయానికంటే అరగంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు. డిపార్ట్మెంట్ అధికారులు, విధుల నిర్వహణకు నియమించిన సిబ్బంది మినహా ఇతరులను అనుమతించకూడదని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు.
‘పది’లమే!
Published Mon, Mar 23 2015 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement