బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
* 2019లో అధికారం మాదే
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికోసం సర్వే చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. జిల్లాల వారీగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులు.., వారిలో పోరాట పటిమ కలిగినవారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్టుగా చెప్పారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షపార్టీ బీజేపీయేనన్నారు. 2019లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు. కేవలం ప్రతిపక్షంగా మిగిలిపోవడానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా లేవని, టీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటాలు చేయడానికి పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో ఉన్నారని చెప్పారు.
బీజేపీ పోరాటాల ఆరంభాన్ని ఆగస్టు రెండోవారం నుంచి చూస్తారని, సెప్టెంబర్ 17 నాటికి బీజేపీ పోరాటం అంటే ఏమిటో టీఆర్ఎస్ ప్రభుత్వం రుచి చూ డాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ ఏలుబడి నుంచి విముక్తిపొంది భారతదేశంలో విలీనమైందని, ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చేదాకా ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించని జాతి తెలంగాణ ఒక్కటేనన్నారు. స్వంత రాష్ట్రంలోనూ ఆత్మగౌరవంతో, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేకుండా పోయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా సీఎం కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లకోసం, ఎంఐఎంతో చీకటిదోస్తీ వల్లనే సెప్టెంబర్ 17నవిమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంలేదని ఆరోపించారు.
ప్రభుత్వమే నిర్వహించాలి..
సెప్టెంబర్ 17న ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఆగస్టు మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అవుతుందని, ఈ ఉద్యమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను జనంలో చర్చకు పెడతామన్నారు. అక్టోబర్లో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నట్టు చెప్పారు. నెలాఖరులోపు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి చేస్తామన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో వైఫల్యాలు, అవినీతి ఉన్నాయన్నారు. రెండు బెడ్రూముల ఇళ్లు, దళితులకు భూపంపిణీ, కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య వంటివాటివెన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేయలేదన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారికి న్యాయసహాయం అందిస్తామన్న మజ్లిస్ తీరును, మజ్లిస్కు టీఆర్ఎస్ మద్దతును ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు.
గెలుపు గుర్రాలకోసం అన్వేషణ
Published Fri, Jul 15 2016 1:10 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement