ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్ | Second phase counselling is end | Sakshi
Sakshi News home page

ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్

Sep 23 2016 6:44 PM | Updated on Sep 4 2017 2:40 PM

వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిందని ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.

రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిందని ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.

అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు వారికి కేటాయించిన పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని లేకుంటే సీటు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు రిపోర్ట్ చేయక పోవడం వల్ల ఏర్పడే ఖాళీలను అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement