కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన | revanth reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన

Oct 11 2016 1:13 AM | Updated on Aug 14 2018 10:54 AM

కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన - Sakshi

కొత్త జిల్లాల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన

రాష్ట్రపతి, గవర్నర్‌ల విశేషాధికారాలను అతిక్రమిస్తూ కొత్త జిల్లాల పేరుతో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి, గవర్నర్‌ల విశేషాధికారాలను అతిక్రమిస్తూ కొత్త జిల్లాల పేరుతో సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీటిని చూస్తూ గవర్నర్ ఊరుకుంటే ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కొత్త జిల్లాలపై సీఎం తీసుకొచ్చే ఆర్డినెన్స్‌ను గవర్నర్ తిప్పి పంపాలన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు.

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటులో వివక్ష, ఆదివాసీ హక్కులకు భంగం, జోనల్ వ్యవస్థను భగ్నం చేయడం, నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అణగారిపోయేలా కొత్త ప్రాంతాల ఏర్పాటు వంటి  ఉల్లంఘనలకు   పాల్పడ్డారని ఆరోపించారు. 31 జిల్లాల వల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లన్నీ తారుమారు అవుతాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement