శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు.
హైదరాబాద్: శీతాకాలం విడిది నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హకీంపేట విమానాశ్రయంలో ప్రణబ్ కు స్వాగతం పలకనున్నారు.
ఈ నెల 31వరకు హైదరాబాద్లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి కూడా రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు.