రైతులను ఆదుకోండి: పొంగులేటి | Ponguleti comments on state government | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోండి: పొంగులేటి

Jun 12 2017 3:56 AM | Updated on Mar 18 2019 9:02 PM

రైతులను ఆదుకోండి: పొంగులేటి - Sakshi

రైతులను ఆదుకోండి: పొంగులేటి

వ్యవసాయరంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయరంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టు బాటు ధర, ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇంకా పూర్తి చెల్లిం పులు లేవని ఆరోపించారు. ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం పెట్టలేదని, వార్షిక రుణప్రణాళిక వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అక్రమాలు జరిగాయని, ఒక్కో రైతు నుంచి వందల రూపాయలు వసూలు చేశారన్నారు. రైతు సంక్షేమ నిధి పక్క దారి పట్టిందని, సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయకుండా ఇష్టరీతిలో ఖర్చు చేస్తు న్నారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement