'పన్ను' లాగితే బియ్యం బయటపడ్డాయ్! | police seazed a lorry which illigally transporting ration rice | Sakshi
Sakshi News home page

'పన్ను' లాగితే బియ్యం బయటపడ్డాయ్!

Jul 24 2015 8:35 PM | Updated on Sep 3 2017 6:06 AM

తీగ లాగితే డొంక కదిలినట్లు అంతర్రాష్ట్ర రవాణ పన్ను చెల్లించకుండా అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. పట్టుబడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బయటపడ్డాయి.

హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలినట్లు అంతర్రాష్ట్ర రవాణ పన్ను చెల్లించకుండా అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. పట్టుబడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి శుక్రవారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు ఓ లారీ వచ్చింది. మార్గమధ్యలో అంతర్రాష్ట్రాల వాహనాల పన్నును చెల్లించకుండా తప్పించుకున్న ఆ వాహనాన్ని ఎస్‌ఓటీ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. తీరా ఆ లారీని పరిశీలించగా దాదాపు 14 టన్నుల రేషన్ బియ్యం బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement