శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అగచాట్లు | Passengers protest Indigo staff behaviour, staying still late at Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అగచాట్లు

Jan 23 2016 7:27 AM | Updated on Sep 3 2017 4:10 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు.

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. రాయపూర్‌ వెళ్లేందుకు టికెట్లు తీసుకున్న 70 మంది ప్రయాణికులను విమానం నుంచి దిగిపోయారు. విమానం ఎక్కే సమయంలో ఇండిగో సిబ్బంది, ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇండిగో సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి ప్రయాణికులు దిగిపోయినట్టు తెలిసింది.

ప్రయాణికులను వదిలి విమానాన్ని ఎయిర్‌ పోర్టు అధికారులు పంపించేశారు. దాంతో రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు ఉండిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement