పాలమూరు బంద్తో మీరు సాధించిందేమిటి? | Nagam Janardhan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

పాలమూరు బంద్తో మీరు సాధించిందేమిటి?

Jul 11 2015 1:45 PM | Updated on Mar 29 2019 9:07 PM

పాలమూరు బంద్తో మీరు సాధించిందేమిటి? - Sakshi

పాలమూరు బంద్తో మీరు సాధించిందేమిటి?

టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు తీవ్రనష్టం కలుగుతోందని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు తీవ్రనష్టం కలుగుతోందని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... మీ రాజకీయాల వల్ల తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ను పరోక్షంగా విమర్శించారు. రూ. వెయ్యి కోట్లతో పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా 8 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు.

రూ. 11 వేల కోట్లతో 25 పెద్ద ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఈ సందర్భంగా  తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహబూబ్నగర్ (పాలమూరు) బంద్తో మీరు సాధించిందేమిటని నాగం జనార్దన్రెడ్డి...కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement