'హైదరాబాద్లో విస్తృత వాప్యార అవకాశాలు'
రాష్ట్రంలో వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు చక్కటి వాతావరణ ఉందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు.
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో వివిధ వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు చక్కటి వాతావరణ ఉందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తెలిపారు. శనివారం పంజాగుట్టలో జోయాలుక్కాస్ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్, భూకంపాలు వంటి భయాలు హైదరాబాద్కు లేనేలేవన్నారు.
అందుకే వ్యాపారసంస్థలు, పరిశ్రమలు ఇటువైపు మొగ్గు చూపుతున్నాయని చెప్పారు. అందుకే ఆపిల్, గుగూల్ వంటి ప్రముఖ సంస్థలు నగరానికి వచ్చాయన్నారు.


