లోక్ అదాలత్ను ప్రారంభించిన భారత ప్రధాన న్యాయమూర్తి | lok adalat inaugurated by supreme court chief justice HL Dattu | Sakshi
Sakshi News home page

లోక్ అదాలత్ను ప్రారంభించిన భారత ప్రధాన న్యాయమూర్తి

Dec 6 2014 11:40 AM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు శనివారం హైకోర్టులో మెగా లోక్ అదాలత్ను ప్రారంభించారు.

హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు శనివారం హైకోర్టులో మెగా లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఇది జాతీయ స్థాయిలో రెండో లోక్ అదాలత్.

గత ఏడాది పది లక్షల కేసులు పరిష్కారించామని, ఈసారి మరింత ఎక్కువ లక్ష్యాన్ని పెట్టుకున్నామని జస్టిస్ దత్తు చెప్పారు. ఇదో చారిత్రక దినమని, న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది వంటిదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోతిసేన్ గుప్తా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement