గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి | KE krishnamurthy respond on not attend to ap cabinet meeting | Sakshi
Sakshi News home page

గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి

Jul 22 2015 12:19 PM | Updated on Jul 23 2018 7:01 PM

గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి - Sakshi

గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి

రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఈ నెల తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ముఖ్యమంత్రి అనుమతితోనే ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పష్టత ఇవ్వాలని కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాలకు కేఈ దూరంగా ఉన్నారంటూ కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement