ఉప్పల్లో ఉద్రిక్తం | high tension in uppal | Sakshi
Sakshi News home page

ఉప్పల్లో ఉద్రిక్తం

Oct 14 2015 10:55 AM | Updated on Sep 3 2017 10:57 AM

నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఆటో స్టాండ్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) యత్నిస్తుంది.

హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఆటో స్టాండ్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)  యత్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఆటో యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ స్థలం ఆటో స్టాండ్గా ఉందని...ఇప్పుడు ఈ ప్రదేశంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆటో డ్రైవర్లు... జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఆటోయూనియన్ నాయకుల వాదనను జీహెచ్ఎంసీ అధికారులు తొసిపుచ్చి... రైతు బజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఆ విషయం తెలిసిన ఆటో యూనియన్ నాయకులు రాత్రికి రాత్రే ఆటో స్టాండ్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement