విద్యుదాఘాతంతో జీహెచ్‌ఎంసీ కార్మికుడి మృతి | GHMC Worker killed by an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో జీహెచ్‌ఎంసీ కార్మికుడి మృతి

Mar 3 2016 5:44 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుత్ స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

విద్యుత్ స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలో గురువారం వెలుగుచూసింది. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన రాజు(28) గత పది సంవత్సరాల నుంచి జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

ఈక్రమంలో ఈ రోజు స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement