ఏప్రిల్ రెండో వారంలోనే హుస్సేన్సాగర్లో సీప్లేన్
10 సీట్ల తేలికపాటి విమానాలు నడిపేందుకు సిద్ధమైన సంస్థలు
ఒక్కొక్కరికి రూ. 3వేలు చార్జీ
పొరుగు పట్టణాలనూ చుట్టిరావచ్చు
‘డక్ బస్’ నడిపే యోచనలో పర్యాటక శాఖ
హైదరాబాద్: కొంచెం సేపు హుస్సేన్సాగర్లో బుద్ధుడి విగ్రహం చెంత విహరించి... అంతలోనే గాల్లోకి లేచి హైదరాబాద్ పైన చక్కర్లు కొట్టి.. అవసరమైతే ఏ వరంగల్లో, కరీంనగర్నో చుట్టేసి.. మళ్లీ వచ్చి హుస్సేన్సాగర్లో నీటిపై పడవలా తేలియాడుతూ ఉంటే... భలేగా ఉంటుంది కదూ. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ అనుభూతిని స్వయంగా అనుభవించొచ్చు. అదే ‘సీప్లేన్’... నీటి మీద పడవలా విహరిస్తూ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే తేలికపాటి చిన్న విమానం. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ‘సీప్లేన్’ హైదరాబాద్లో కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తోంది. హెలీటూరిజంలో భాగంగా గగనతలం నుంచి హైదరాబాద్ అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించిన పర్యాటక శాఖ... అదే ఊపులో ‘సీప్లేన్’నూ రంగంలోకి దింపుతోంది. పౌర విమానయాన శాఖ అనుమతి వస్తే ఏప్రిల్ 15 నుంచి దాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువే
పర్యాటకులను ఆకట్టుకొనేందుకు అండమాన్లో స్థానిక యంత్రాంగం ‘సీప్లేన్’ను నడుపుతోంది. ఇది త్వరలోనే ముంబై, కొచ్చిన్, గోవాల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. తాజాగా హైదరాబాద్కూ రానుంది. హైదరాబాద్లో పది సీట్లుండే ‘సీప్లేన్’ను నడిపేందుకు కొచ్చిన్, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు సంస్థలు ముందుకొచ్చాయి. 800 మీటర్ల వెడల్పు, కిలోమీటరు రన్వేకు తగ్గ నీటి వైశాల్యం, 2 మీటర్ల లోతుంటే సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల ఆ రెండు సంస్థల సిబ్బంది వచ్చి హుస్సేన్సాగర్ను పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అందులో విహరిస్తూ హైదరాబాద్ అందాలను ఆకాశం నుంచి వీక్షించాలంటే ఒక్కొక్కరు రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇటీవల మొదలుపెట్టిన హెలికాప్టర్ రైడ్ కంటే తక్కువ కావడం విశేషం.
హైవేలపై ‘మిడ్వే’లు: చందూలాల్
దూర ప్రయాణాల మధ్యలో పర్యాటకులు సేదతీరేందుకు జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన ‘మిడ్ వే (హైవేలపై పలు సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు)’లను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. గురువారం ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘మిడ్ వే’లలో విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తామని... తొలి విడతగా సిద్దిపేట, జడ్చర్లలో వీటిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇక పర్యాటక ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పా రు. వరంగల్లో కాకతీయ ఉత్సవాలు, వేములవాడలో చాళుక్యుల ఉత్సవాలు, కరీంనగర్లో శాతవాహన ఉత్సవాలు, హైదరాబాద్లో గోల్కొండ ఉత్సవాల వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే నూతన భాషా, సాంస్కృతిక, పర్యాటక విధానాన్ని ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆయా విభాగాల వార్షిక క్యాలెం డర్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పర్యాటకుల కోసం హైదరాబాద్లో ‘షీక్యాబ్’లను సిద్ధం చేయాలని సూ చించారు. ఆసక్తి ఉన్నవారికి పేరిణి నృత్యంలో శిక్షణ ఇవ్వాలని, రవీంద్రభారతి మరమ్మతులను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరలో డక్ బస్
రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నీటిలోకి దూసుకుపోతే..? సాధారణ బస్సు అయితే ప్రమాదమేగానీ... ‘డక్ బస్’ అయితే మాత్రం హాయిగా కేరింతలు కొట్టొచ్చు. ఈ బస్సులో రోడ్డుపై ప్రయాణించడమే కాదు నీటిలో పడవలా కూడా విహరిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో ఇలాంటి బస్సు లేదు. త్వరలో హుస్సేన్సాగర్లో ‘డక్ బస్సు’లో విహరించే అవకాశాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది.
కాసేపు నీటిలో.. అంతలోనే గాల్లోకి..
Published Fri, Mar 11 2016 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement