100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు: సీఎం | CM Kcr meeting on journalists homes in hyderabad | Sakshi
Sakshi News home page

100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు: సీఎం

Feb 8 2016 7:40 PM | Updated on Sep 4 2018 5:07 PM

100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు: సీఎం - Sakshi

100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు: సీఎం

జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగు ముందుకు వేశారు.

బుద్వేల్లో స్థలాన్ని గుర్తించామన్న కేసీఆర్..త్వరలో నిర్మాణాలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగు ముందుకు వేశారు.  సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తొలి దశలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో జర్నలిస్టులకు నివాస గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. నగర శివారులోని బుద్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల్లో జర్నలిస్ట్లకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అక్కడ త్వరలో నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దశల వారీగా జర్నలిస్టులందరికీ నివాస గృహాలు నిర్మించాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement