గొత్తికోయల దాడి వెనుక సీఎం కుట్ర | Sakshi
Sakshi News home page

గొత్తికోయల దాడి వెనుక సీఎం కుట్ర

Published Thu, Sep 21 2017 2:35 AM

గొత్తికోయల దాడి వెనుక సీఎం కుట్ర - Sakshi

హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తాం: రమణ, రేవంత్‌
 
సాక్షి, హైదరాబాద్‌: తాడ్వాయి అడవుల్లో గొత్తికోయలపై అటవీ అధికారుల దాడి వెనుక సీఎం కేసీఆర్‌ కుట్ర ఉందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు, జాతీయ గిరిజన హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని వారు తెలిపారు.

తాడ్వాయి మండలం జలగలంచ అటవీ ప్రాంతంలో అధికారుల దాడికి గురైన బాధిత గిరిజనులు బుధవారం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. వీరిని ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి పరామర్శించారు. 

Advertisement
Advertisement