ప్రాణం తీసిన ఈత సరదా | child dies of checkdam | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Jul 5 2015 1:39 PM | Updated on Mar 28 2018 11:08 AM

స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు.

హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా): స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు..  గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈతకెళ్లాడు.

అయితే, ఈతకెళ్లిన ఫయాజ్ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement