'ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు' | bjp leaders blames the opposition | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలు'

Aug 22 2015 12:36 PM | Updated on Mar 28 2019 8:37 PM

రాష్ట్ర విభజన సమయంలో నిద్రపోయిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు రఘునాథబాబు, సుధీశ్ రాంభట్ల వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నిద్రపోయిన ప్రతిపక్షాల నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు రఘునాథబాబు, సుధీశ్ రాంభట్ల వ్యాఖ్యానించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తోంది వెంకయ్యనాయుడు మాత్రమేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రతిపక్షాలవి అవగాహన లేని విమర్శలంటూ మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రూ.63వేల కోట్లను ఏపీ అభివృద్ధికి కేటాయించిందని రఘునాథబాబు, సుధీశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement