Sakshi News home page

పూరీ జగన్నాథ్ దంపతులకు ముందస్తు బెయిలు

Published Mon, Sep 1 2014 7:46 PM

పూరీ జగన్నాథ్ - Sakshi

హైదరాబాద్: భూ వివాదం కేసులో ప్రముఖ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ దంపతులకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.  5 కోట్ల రూపాయల భూవివాదానికి సంబంధించి బాధితులు . పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో జగన్నాథ్ దంపతులు కోరిన విధంగా కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

తనను బిల్డర్ సుబ్బరాజు, రామరాజులు మోసగించారని  పూరీ జగన్నాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్లోని తన కుటుంబానికి చెందిన ఖాళీ స్థలాన్ని రామరాజు, సుబ్బరాజులకు ఐదేళ్ల కిత్రమే విక్రయించానని చెప్పారు. అప్పటికి మాసాబ్ట్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్లో తనకు 5 కోట్ల రూపాయల రుణం ఉన్నట్లు తెలిపారు.  ఆ ఇద్దరికి ఈ విషయం  చెప్పానని పూరి స్పష్టం చేశారు. అయితే ఆ రుణాన్ని తమ పేర్లపైకి బదిలీ చేసుకుంటామని వారు హామీ ఇచ్చారన్నారు. . అందుకు ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అంగీకరించాడని  తెలిపారు.అయితే ఆ రుణం బదిలీ కాకపోవడంతో ఈ చిక్కు వచ్చి పడినట్లు తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement