* బ్రాండ్ మిక్సింగ్కు మద్యం మాఫియా సరికొత్త రూటు
* కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా మద్యం బాటిళ్ల మూతల సరఫరా
* శ్రీకాకుళంజిల్లాలో తీగ లాగితే కదిలిన కల్తీ మద్యం డొంక
* ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అదుపులోకి మూతల సరఫరా దారులు, కేశినేని ట్రావెల్స్ నిర్వాహకులు
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో తీగ లాగితే మరో భారీ కల్తీ మద్యం కుంభకోణం డొంక కదిలింది. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం మూతల్ని ట్యాపింగ్ చేసిన వందల బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో గుర్తించారు.
వెంటనే ఎన్ఫోర్సుమెంట్ డైరక్టర్ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని డైరక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్సుమెంట్ విభాగం హైదరాబాద్లోని నాచారంలో కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా బాటిళ్ల మూతలు పార్శిల్ చేస్తున్నారని తేల్చారు. వెంటనే నాచారంలోని కేశినేని కార్గో సర్వీస్ కార్యాలయంలో ఎన్ఫోర్సుమెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేసి మద్యం బాటిళ్ల మూతల బాక్సులు కనుగొన్నారు.
అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన మూతల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు పార్శిల్ చేస్తున్నట్లు తేల్చారు. కేశినేని ట్రావెల్స్ నిర్వాహకుల్ని ప్రశ్నించి మూతల్ని సరఫరా చేస్తున్న సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంత కాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్కు మూతలు సరఫరా చేస్తున్నారో.. ఏ ఏ జిల్లాలకు సరఫరా చేశారో.. ఇందులో కేశినేని కార్గో సర్వీసు పాత్ర ఎంతో నిర్ధారించే పనిలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం ఉంది.
బ్రాండ్ మిక్సింగ్ అంటే?
బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యుషన్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసేసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. ఇలాంటివాటిపై ఎక్సైజ్ అధికారులు విధిగా తనిఖీ చేయాలి. అయితే బ్రాండ్ మిక్సింగ్ను తేల్చి చెప్పే సాధనాలు ఏవీ ఎక్సైజ్ శాఖ వద్ద లేవు. అనుమానమున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ల్యాబొరేటరీలకు పంపాలి. రాష్ట్రంలో ప్రయోగశాలలున్నా అవి అలంకార ప్రాయమయ్యాయి.
బెల్టుషాపుల ద్వారా విక్రయాలు..
మద్యం మాఫియా సరికొత్త రూటును ఎంచుకుని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై టాపింగ్ చేసి బెల్టు షాపుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. మద్యం డైల్యుషన్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. డైల్యుషన్ మద్యం సేవించి పలు జిల్లాల్లో మందుబాబులు మరణిస్తున్నారు. ఇటీవలే గుంటూ రు, అనంతపురం జిల్లాల్లో డైల్యుషన్ మద్యం తాగి పలువురు మత్యువాత పడ్డారు. ఇలా పలు ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
రాష్ట్రంలో మరో కల్తీ మద్యం కుంభకోణం
Published Fri, Jun 10 2016 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement