ఆంధ్ర వాటా 54 టీఎంసీలు | andhra pradesh share is 54 tmc | Sakshi
Sakshi News home page

ఆంధ్ర వాటా 54 టీఎంసీలు

Aug 23 2013 5:55 AM | Updated on Jun 2 2018 7:06 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుకు నీరందించే బలిమెల Cలో రాష్ట్ర వాటాగా 54 టీఎంసీల నీటి నిల్వలున్నాయని జెన్‌కో అధికారులు తెలిపారు. గురువారం ఆంధ్రా-ఒడిశా నీటి వినియోగంపై బలిమెల జల విద్యుత్కేంద్రంలో ఇరు రాష్ట్రాల జెన్‌కో అధికారులు సమావేశయ్యారు.

 సీలేరు,న్యూస్‌లైన్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుకు నీరందించే బలిమెల రిజర్వాయర్‌లో రాష్ట్ర వాటాగా 54 టీఎంసీల నీటి నిల్వలున్నాయని జెన్‌కో అధికారులు తెలిపారు. గురువారం ఆంధ్రా-ఒడిశా నీటి వినియోగంపై బలిమెల జల విద్యుత్కేంద్రంలో ఇరు రాష్ట్రాల జెన్‌కో అధికారులు సమావేశయ్యారు.  బలిమెల రిజర్వాయర్‌లో గురువారం నాటికి 100 టీఎంసీల వరద నీరు ఉండడంతో ఆ నీటిని ఆంధ్రకు 54 టీఎంసీలు, ఒడిశాకు 46 టీఎంసీలు వాడుకునేందుకు అధికారులు నిర్ణయించారు. రానున్న కాలంలో ఆంధ్రకు నీటి సమస్య ఉండదని, తద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్  ఉత్పత్తి చేయవచ్చని అధికారులు చెప్పారు. ప్రస్తుతం సీలేరు రిజర్వాయర్‌లో 1352.5 అడుగుల నీటిమట్టం ఉండడంతో మరికొద్ది రోజులు వరకు బలిమెల నీటిపై ఆధారపడాల్సిన పనిలేదని అంటున్నారు. డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రస్తుతం ప్రమాదస్థాయిలో ఉండడం వల్ల సీలేరులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో ఈ కాంప్లెక్స్‌లో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేదు.
 నిలకడగా డొంకరాయి నీటిమట్టం
 భారీ వర్షాలకు జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి జలాశయాలు వరద నీటితో ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం డొంకరాయి జలాశయం 1037 అడుగులకు చేరడంతో ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని గురువారం మధ్యాహ్నం వరకు విడుదల చేశారు. అక్కడ నీటిమట్టం నిలకడగా 1035.2 అడుగులు ఉండడంతో గేట్లు మూసివేశారు. మరోవైపు డొంకరాయి జలాశయంలో 25 మెగావాట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement