8 మంది ‘నిషా’చరుల లైసెన్స్‌ రద్దు | A total of 71 people were sentenced to jail | Sakshi
Sakshi News home page

8 మంది ‘నిషా’చరుల లైసెన్స్‌ రద్దు

Aug 12 2017 2:27 AM | Updated on Sep 17 2017 5:25 PM

8 మంది ‘నిషా’చరుల లైసెన్స్‌ రద్దు

8 మంది ‘నిషా’చరుల లైసెన్స్‌ రద్దు

నగరంలో నిర్ణీత సమయంలో 12 పెనాల్టీ పాయింట్లు పడితే మాత్రమే కాదు...

మొత్తం 71 మందికి జైలు శిక్ష విధించిన కోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నిర్ణీత సమయంలో 12 పెనాల్టీ పాయింట్లు పడితే మాత్రమే కాదు... మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కినా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు అవుతోంది. పదేపదే మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నాయి. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని న్యాయస్థానాలు 8 మంది మందుబాబు ల డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) వి.రవీందర్‌ శుక్రవారం వెల్లడించారు. నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఈ నెల 7 నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్స్‌లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని 569 మందిని పట్టుకున్నారు.

వీరికి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేసి హాజరుపరిచారు. మొత్తం 71 మందికి జైలు శిక్షలు విధిం చిన కోర్టులు.. 8 మంది డ్రైవింగ్‌ లైసెన్సులు కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. వాహనచోదకుల్లో ఎవరైనా సస్పెండ్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే పోలీసులు పీడీఏ మిషన్ల/ట్యాబ్స్‌ ద్వారా తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ కోర్టులో హాజరుపరుస్తారు. ఇలాంటి ఉల్లం«ఘనకు పాల్పడిన వారికి గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్షపడే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా పట్టుబడిన మొత్తం ‘నిషా’చరులకు కోర్టులు రూ.12.20 లక్షల జరిమానా విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement