సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 11,831 అంగన్వాడీ కేంద్రాలు అనుసంధానమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించాలని విద్యాశాఖ ఇటీవల నిర్ణయించింది. దీంతో ఇప్పటికే 7,602 అంగన్వాడీ కేంద్రాలను గతంలోనే ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తరలించగా, బడిబాటలో భాగంగా తాజాగా 4,229 అంగన్వాడీ కేంద్రాలను తరలించింది. వాటిల్లో బోధించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇదివరకే రూపొందించింది.
మరోవైపు మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పలు పాఠ్యాంశాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండింటినీ పరిశీలించి విద్యార్థులకు బోధన చేపట్టేలా విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం మొత్తంలో 16,332 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 15,446 గ్రామాల్లో 31,414 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరో 8,177 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. అయితే ఆ గ్రామాల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో తగిన వసతులు, తరగతి గదులు లేనందున వాటిని పాఠశాలల పరిధిలోకి తరలించలేదు. పాఠశాలల్లో వసతులు కల్పించి వాటిని కూడా దశల వారీగా పాఠశాలల పరిధిలోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి 12 వేల అంగన్వాడీ కేంద్రాలు
Published Tue, Jun 20 2017 1:52 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాల స్తంభన
- జూలైలో జీశాట్–ఎన్2 ప్రయోగం
- డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన
- అమరావతికి రూ.లక్ష కోట్లు
- సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
- రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
- మొహంజోదారో : ఆ డ్యాన్సింగ్ గర్ల్ విగ్రహం ఎవరిది?
- టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
- సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
- T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
Advertisement