హైదరాబాద్ లో బండారి శ్యామల అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం బండారి శ్యామల(32) అనే వివాహిత తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి బ్రతుకుదెరువు నిమిత్తం 10 క్రితం వచ్చి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వివాహితకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.