ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సమయానికి జమ్మలమడుగు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రతిపక్షనేతపై పూలవాన కురిపించిన కార్యకర్తలు వంద వాహనాల కాన్వాయిని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.