వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు.
వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీకొని రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను టిప్పర్ ఢీకొనడంతో.. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.