‘కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చారు’ | farmer minister ramulu slams on kcr | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చారు’

Sep 25 2015 1:48 PM | Updated on Sep 29 2018 7:10 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చేశారని మాజీ మంత్రి పి.రాములు విమర్శించారు.

అచ్చంపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని శ్మశానంలా మార్చేశారని మాజీ మంత్రి పి.రాములు విమర్శించారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు చావులు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని తెలిపారు. సుమారు 1300 మంది అన్నదాతలు అసువులు బాసినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షల పరిహారం ఇటీవల మృతి చెందిన రైతు కుటుంబాలకే కాకుండా గతంలో మరణించిన వారికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాములు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement