తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, ముత్తగూడెం, ఆదిలాబాద్ లోని వాంఖెడ్, బోరజ్ , మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం చెక్ పోస్టులో దాడులు కొనసాగుతున్నాయి. అశ్వారావు చెక్ పోస్టులో సిబ్బంది రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.