ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు | ACB rides on RTA chek posts in telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు

Sep 8 2015 9:13 AM | Updated on Aug 17 2018 12:56 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, ముత్తగూడెం, ఆదిలాబాద్ లోని వాంఖెడ్, బోరజ్ , మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టింది. 

అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం చెక్ పోస్టులో దాడులు కొనసాగుతున్నాయి. అశ్వారావు చెక్ పోస్టులో సిబ్బంది రూ. 10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement