హెరిటేజ్ హైదరాబాద్ | malladi krishnanand got tourism award | Sakshi
Sakshi News home page

హెరిటేజ్ హైదరాబాద్

Sep 28 2014 1:18 AM | Updated on Aug 15 2018 7:56 PM

హెరిటేజ్ హైదరాబాద్ - Sakshi

హెరిటేజ్ హైదరాబాద్

గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్‌ను పర్యాటక అవార్డు వరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని పర్యాటక భవనంలో పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా శనివారం..

గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్‌ను పర్యాటక అవార్డు వరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని పర్యాటక భవనంలో పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా శనివారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానంద్ ‘సిటీప్లస్’తో మాట్లాడారు. ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పర్యాటక శాఖ అవార్డులిచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది  ‘హెరిటేజ్ హైదరాబాద్’ అనే ఆంగ్ల పుస్తకానికి గాను ఎక్సలెన్స్ ఇన్ రైటింగ్/పబ్లికేషన్ (ఇంగ్లిష్) విభాగం కింద ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని చారిత్రక, వారసత్వ సంపదను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో నయాఖిల్లాలోని అరుదైన చెట్టు, సంతోష్‌నగర్‌లోని పైగా టూంబ్స్, మలక్‌పేట దగ్గర్లోని రేమండ్స్ సమాధి వంటి ఎన్నో చారిత్రక, వారసత్వ సంపదకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా విడుదలైన ఈ పుస్తకం రెండు నెలల్లోనే రీ ప్రింట్‌కు వెళ్లింది కూడా. ప్రస్తుతం విశాలాంధ్ర, నవోదయ వంటి పుస్తక కేంద్రాల్లో లభ్యమవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement