చాలామంది చర్మ సంరక్షణలో ఇది వాడవచ్చా, వాడకూడదా, ఏది వాడాలి, ఏది వాడకూడదు.. అనే సంశయంలో ఉంటూ ఉంటారు. చర్మం కాస్త డల్గా అయినా జీవం కోల్పోయినట్టు భావిస్తారు. ఈ సమస్య రాకుండా ఉండటానికి.. చర్మకాంతి పెరగడానికి... 5 సూచనలు పాటించవచ్చు.రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్లా చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్ సులువుగా వదిలిపోతుంది. తర్వాత ముఖాన్ని ఫేస్వాష్తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఒంటికి చెమట పట్టేలా చేసే రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటివి తప్పనిసరిగా రోజులో 20 నిమిషాలైనా చేయాలి. చెమట ద్వారా స్వేద రంధ్రాలలో చేరిన మురికి విడుదల అవుతుంది. యోగా వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.
చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్ధం చేసుకోవాలి. రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలి కొసలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది.
నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తినాలి. చర్మం జీవం లేనట్టుగా కనిపిస్తే రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని అర్ధం. అందుకని రోజూ 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలనే నియమం పెట్టుకోండి. అలాగే, రోజులో మూడుసార్లు సబ్బు లేకుండా కేవలం మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరిచి, మాయిశ్చరైజర్ రాయాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం సహజకాంతితో కళకళలాడుతుంది.
ఫ్రెష్ ఫైవ్
Published Thu, Sep 6 2018 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement