టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి | TRS joined the   Issues, disputes | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి

Apr 5 2014 1:55 AM | Updated on Oct 17 2018 6:06 PM

టీఆర్‌ఎస్‌లో చేరిన  బాజిరెడ్డి, చంద్రావతి - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి

నిజామాబాద్ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంకా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు రాకుండా ఆంధ్రా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

ఈ కుట్రలను ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు పడవని తెలుసుకుని, మోడీ జపంతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ‘నేను విజయవాడలో పోటీ చేస్తే...ఆంధ్రోళ్లు ఓట్లు వేస్తారా’ ? అని ప్రశ్నించారు. అందుకే ఇక్కడ ఆంధ్రోళ్ల పార్టీకి ఓట్లు వేయవద్దని అన్నారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతి, నిర్మల్‌కు చెందిన ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీలో చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement