రాజన్నకు రుణపడి ఉన్నాం | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

రాజన్నకు రుణపడి ఉన్నాం

May 5 2014 1:20 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాజన్నకు రుణపడి ఉన్నాం - Sakshi

రాజన్నకు రుణపడి ఉన్నాం

వైఎస్సార్ రుణాలు మాఫీ చేయడంతోపాటు‘మార్జిన్ మనీ’ పథకాన్ని తొలగించి 50శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.

 50 శాతం సబ్సిడీతో కొత్తగా రుణాలు..  
వైఎస్సార్ రుణాలు మాఫీ చేయడంతోపాటు‘మార్జిన్ మనీ’ పథకాన్ని తొలగించి 50శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. రూ.2.50 లక్షల్లోపు రుణాలకు 50శాతం మైనారిటీ కార్పొరేషన్, రూ. 40శాతం బ్యాంకులు, 10శాతం లబ్ధిదారుని వాటాగా పెట్టారు. ఇందులో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పూర్తిగా మాఫీ (తిరిగి చెల్లించనవసరం లేదు) అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

  •  ముస్లిం మహిళల అంతరంగం  
  •  వైఎస్ ఆశయాలు నెరవేరాలంటే జగన్ సీఎం కావాలి

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:  మైనారిటీ కార్పొరేషన్, బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడి మంజూరు చేయించుకున్న రుణాలకు సంబంధించి నెలనెలా కంతులు, వడ్డీలు చెల్లించలేక పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న కుటీర పరిశ్రమలు సక్రమంగా నడవక, వచ్చిన సొమ్ముతో కటుంబాన్ని పోషించుకోలేక, గడువు కోసం.. నెల తిరక్కుండానే రుణాల చెల్లించాలని వచ్చే అధికారుల కాళ్లవేళ్లా పడలేక రుణ పీడితులు ఎదుర్కొన్న సమస్యలు అనేకం. అప్పులు కట్టలేక, కొత్తగా రుణాలు పొందలేక పడుతున్న కష్టాలను గమనించిన మహానేత.. పీడితులకు అండగా నిలిచారు. చంద్రబాబు హయాం నుంచి 2008 వరకు మైనారిటీలు తీసుకున్న రుణాలను మాఫీ చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 400 కోట్ల రుణాలు మాఫీ చేసి తమ భారాన్ని దింపిన రాజన్నకు రుణపడి ఉన్నామని, ఆయన ఆశయాలు నెరవేర్చే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామని మైనారిటీలు తేల్చి చెబుతున్నారు.
 
 నిబంధనాల నుంచి విముక్తి..  వైఎస్సార్ మైనారిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ముస్లింలతోపాటు ఇతర మైనార్టీలుగా గుర్తింపు ఉన్న క్రైస్తవులు, బౌద్ధులు, పార్శియులకు రుణాలు అందజేశారు.  
 
 రుణం నుంచి విముక్తి..  2008లో రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా ముస్లింలకు కూడా లక్షరూపాయలలోపు రుణాలను మాఫీ చేశారు. అదే సంవత్సరం మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో జిల్లాలో 30వేల మందికి పైగా ముస్లింలకు రుణభారం నుంచి విముక్తి లభించింది.  బ్యాంకబుల్ స్కీమ్స్, ఇందిరా మహిళ అభివృద్ధి యోజన (తాత్కాల్), మైక్రో క్రెడిట్ టూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోమా గ్రూప్స్ మ్యాచింగ్ గ్రాంట్స్, మౌలానా అబుల్ కలాం అజాద్ ఎడ్యుకేషనల్ లోన్స్, దుకాన్- మకాన్, ఆటో నగర్, రాజీవ్ సనత్‌కార్ యోజన, ఎన్‌ఎండీ ఎఫ్‌సీ డెరైక్టు లోన్, ఒకేషనల్ ట్రైనింగ్ ప్రొగాం, స్మాల్ డెరైక్టు లోన్స్ తదితర స్కీంల కింద పొందిన రుణాలన్నింటినీ మాఫీ చేసి బాధితులకు విముక్తి కల్పించారు.
 
 వైఎస్ రుణం తీర్చుకోలేనిది
 వైఎస్సార్ మా ముస్లింలకు చాలా మేలు చేశారు. మేము 2006లో రూ.50వేల రుణం తీసుకున్నాం. అవి బ్యాంకు లింకేజీ కావడంతో నెలనెలా చెల్లించేవాళ్లం. రాజన్న ఆ కష్టాలు తొలగించారు. ఆయన రుణం తీర్చుకోలేం.  
 - నసీంబాను, సహారా పొదుపు గ్రూపు, కర్నూలు
 
 రాజన్న కొడుకే సీఎం కావాలి
 వైఎస్సార్ మా రుణాలు మాఫీ చేసి చాలా మేలు చేశారు. ఆయన మరణించినప్పుడు సొంత మనిషి చనిపోయినంత ఆవేదన కల్గింది. ఆయన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్లీ అలాంటి మేలే చేస్తారు.         - షమీమ్ బాను, సహారా గ్రూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement