సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేను.. ఈ ఎన్నికల్లో నాకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఓ వర్గం నన్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది...’ ఇది టికెట్ల కేటాయింపునకు ముందు నందీశ్వర్గౌడ్ వ్యక్తం చేసిన ఆవేదన. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వచ్చి నందీశ్వర్కు టికెట్ ఇచ్చింది. అయినా అదే వర్గం ‘శల్యసారథ్యం’ చేస్తూ సొంత పార్టీ అభ్యర్థికే ‘చెయ్యి’చ్చి ‘కారు’ గేర్లు మారుస్తున్నారు. గెలిచే సీటును కుట్రలు కుతంత్రాలతో ఓడించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ పటాన్చెరు సెగ్మెంట్ బరిలో ఉన్నారు. పార్టీ కేడర్తో ఎన్నికల్లో దూసుకె ళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ ముఖ్యులే ఆయనను కుట్రపూరితంగా వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి పోటీదారులతో కలిసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ కేటాయించే సమయం నుంచి తెరవెనక ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం నాయకులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ముందు వారి ఆటలు సాగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నందీశ్వర్గౌడ్కు టికెట్ కేటాయించారు. ఇది మింగుడుపడని పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు నందీశ్వర్గౌడ్ను ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలనే తలంపుతో కుట్రలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
భూపాల్రెడ్డి ప్రచారానికి దూరం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్గౌడ్కు మద్దతుగా ఇంతవరకు ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. దీన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా తప్పుబడుతున్నారు. భూపాల్రెడ్డి దూరంగా ఉండటంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా రామచంద్రాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్గౌడ్కు మద్దతుగా పనిచేయటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్గౌడ్.. భూపాల్రెడ్డితో సహా అందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేసినా సొంత పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించటంలేదని తెలుస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు స్వయంగా కలగజేసుకుని భూపాల్రెడ్డికి ఫోన్చేసి నందీశ్వర్గౌడ్కు సహకరించాలని సూచించిన విషయం విదితమే. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Breadcrumb
Related news
-
యూటీలు ఎటో?
కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) మొదటి నుంచీ జాతీయ పార్టీలదే ఆధిపత్యం! గత ఎన్నికల్లో యూటీల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి మరిన్ని సీట్లపై కన్నేయగా, వాటిల్లో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది... 2019 లోక్సభ ఎన్నికల్లో యూటీలను బీజేపీ కొల్లగొట్టింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లనూ చేజక్కించుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్ల్లో 3 సీట్లు నెగ్గింది. చండీగఢ్ ఎంపీ సీటును కాషాయ పార్టీ తరఫున ప్రముఖ నటి కిరణ్ అనుపమ్ ఖేర్ వరుసగా రెండోసారి గెలిచారు. అంతక్రితం ఈ సీటు కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. డామన్ డయ్యు స్థానమూ బీజేపీ హస్తగతమైంది. 1987లో ఏర్పాటైన ఈ యూటీలో కాంగ్రెస్ 5 సార్లు, బీజేపీ 6 సార్లు నెగ్గాయి. అయితే 2009 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. అండమాన్ నికోబార్లో మాత్రం బీజేపీ సీటును కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది! 2009, 2014ల్లో బీజేపీ గెలిచిన ఈ స్థానం 2019లో కాంగ్రెస్ పరమైంది. దాద్రానగర్ హవేలీ సీటును 2021 ఉప ఎన్నికల్లో శివసేన గెలుచుకుంది. ఇక్కడ పలు పార్టీల తరఫున ఏకంగా ఏడుసార్లు నెగ్గిన మోహన్భాయ్ సంజీభాయ్ దేల్కర్ 2019లో స్వతంత్రునిగా నెగ్గారు. 2021లో అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆయన భార్య కాలాబెన్ మోహన్భాయ్ దేల్కర్ శివసేన తరఫున పోటీ చేసి నెగ్గారు. ఇక లక్షద్వీప్లో కాంగ్రెస్ హవాకు 2019లో ఎన్సీపీ అడ్డుకట్ట వేసింది. ఇటీవల మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షదీ్వప్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. మోదీ పర్యటన తర్వాత టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. పుదుచ్చేరిపై పార్టీల గురి పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలైన ఎన్ఆర్ కాంగ్రెస్ (ఎన్ఆర్సీ), డీఎంకేతో పాటు కాంగ్రెస్ కూడా చక్రం తిప్పుతున్నాయి. ఈ ఎంపీ సీటును 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్ఆర్సీ గెలుచుకుంది. 2019లో దీన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుని బీజేపీ, ఎన్ఆర్సీలతో కూడిన ఎన్డీఏ కూటమికి షాకిచి్చంది. ఎన్.రంగస్వామి కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. నాటినుంచి ఇక్కడ కాంగ్రెస్ తేరుకోలేకపోతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో ఎన్ఆర్సీ 10 చోట్ల గెలిచింది. బీజేపీకి 6 సీట్లు రావడంతో రంగస్వామి మళ్లీ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న యానాం కూడా ఉండటం విశేషం! కశ్మీర్..బీజేపీ బ్రహ్మాస్త్రం 2019లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటినుంచీ జమ్మూ కశ్మీర్పై మోదీ సర్కారు ఫోకస్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలి్పస్తున్న ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలున్నాయి. 2019లో జమ్ము, లద్ధాఖ్లోని 3 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాశ్మీర్ లోయలోని 3 సీట్లను జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ) చేజిక్కించుకుంది. 2014లో కూడా బీజేపీకి 3 సీట్లు రాగా పీడీపీకి 3 దక్కాయి. 2014 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లలో గెలిచి ముఫ్తీ మహమ్మద్ సయీద్ సీఎంగా సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి. 2016లో ఆయన మరణించడంతో కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది సెపె్టంబర్ లోపు అక్కడ జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత దానికి మళ్లీ రాష్ట్ర హోదా దక్కే అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ చక్రం తిప్పిన కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ రాజీనామాతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సొంత పార్టీ పెట్టుకున్న ఆజాద్ చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. జమ్ములోని 2 సీట్లలో కాంగ్రెస్కు ఎన్సీ, పీడీపీ మద్దతివ్వనున్నాయి. కాశ్మీర్ లోయలోని 3 సీట్లపై మాత్రం పీటముడి పడింది. మూడింట్లోనూ పోటీ చేస్తామని ఎన్సీ ప్రకటించింది. పీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. సర్వేల అంచనాలు ఇలా... ఈసారి కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీలో మళ్లీ క్లీన్స్వీప్తో పాటు పుదుచ్చేరి, లద్దాఖ్, చండీగఢ్ ఆ పార్టీ పరం అవుతాయంటున్నాయి. జమ్ము కశ్మీర్లో 2, దాద్రానగర్, డామన్ డయ్యు, అండమాన్ సీటు కూడా బీజేపీవేనన్నది వాటి అంచనా. కాంగ్రెస్ లక్షదీ్వప్లో మాత్రం నెగ్గవచ్చని, కశ్మీర్లోని 3 సీట్లలో ఎన్సీ గెలుస్తుందని అన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోరు జోరుగా.. హుషారుగా.. కాంగ్రెస్!
వికారాబాద్: రాష్ట్రమంతా కాంగ్రెష్ జోష్ ఉందని.. కార్యకర్తలంతా పార్టీ గెలపుకోసం కలిసికట్టుగా పని చేయాలని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ బూత్ కో ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నందున అధికార పార్టీ నేతలు సైతం హస్తం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపు వ్యూహమే మన రాష్ట్రంలో అమలు చేస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు మరింత శ్రద్ధతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటుగా అధికార పార్టీ సర్వేలోనూ పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమే ప్రచారం జోరుగా సాగుతోందన్నారు. బూత్ కోఆర్డినేటర్స్ ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడంతో పాటుగా క్షేత్రస్థాయిలో సైతం ఓటు వేసే విధానాల గురించి వివరించాలన్నారు. అనంతరం గద్దర్ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మాజీ ఎంపీపీ అంజిలయ్య, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శులు యాదయ్య, సత్యనారయణ, కుల్కచర్ల ఎంపీటీసీ సభ్యుడు ఆనందం, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాంచందర్, బీసీ సెల్ అధ్యక్షుడు మహేశ్, మండల ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, పార్టీ మీడియా కోఆర్డినేటర్స్ భాస్కర్, భరత్ కుమార్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో బీజేపీ పాలనే.. బీఆర్ఎస్ ఇక నాలుగు నెలలే..
నిజామాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా నాలుగు నెలలేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం కల్వరాల్, సదాశివనగర్ మండల కేంద్రంలో వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టాన్ని చూసి బాధిత రైతుల కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు లకు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పేరుతో ఎకరాకు రూ. 5 వేలు ఇస్తూ ఇతర పథకాలను ఎత్తివేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మండలాధ్యక్షుడు నర్సింరెడ్డి, ఎంపీటీసీలు మహిపాల్ యాదవ్, భైరవరెడ్డి, నా యకులు పైళ్ల కృష్ణారెడ్డి, పొతంగల్ కిషన్రావు, కొప్పుల గంగారెడ్డి, మర్రి రాంరెడ్డి, సురేందర్రెడ్డి, మార రమేశ్రెడ్డి, నర్సారెడ్డి, స్వామి గౌడ్, గంగాధర్రావు, భూంరావ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలు.. బాబాయ్, అబ్బాయ్ వార్..
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే. ఉత్తరాంధ్రలో నాటు సామెత ఇది. అక్కడి రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. పదవుల కోసం, ఆధిపత్యం కోసం బంధుత్వాలను కూడా లెక్కచేయకుండా పోటీపడుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్.. అబ్బాయ్ ల మద్య ఇదే తరహా పొలిటికల్ వార్ నడుస్తోంది. టిడిపిలో టాప్ 2 లీడర్స్ గా ఎదిగినా వెన్నుపోటు రాజకీయాలు మాత్రం మానడం లేదు. ఇంతకీ బాబాయ్ అబ్బాయ్ లు ఎవరో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు యర్రంనాయుడు పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయకుడు యర్రంనాయుడు. అనుకోకుండా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యాక టిడిపి లో టాప్ 2 పొజిషన్ లో నిలిచిపోయారు. యర్రంనాయుడు పార్లమెంట్ సీటుకి ఫిక్స్ అయిపోయాక అసెంబ్లీ స్థానంలోకి అచ్చెన్నాయుడు వచ్చి చేరారు. ఈలోగా యర్రంనాయుడు మృతి చెందడంతో అనూహ్యంగా 2014 ఎన్నికల్లో యర్రంనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో కూడా రామ్మోహన్ నాయుడు గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తరువాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు హవా కొనసాగుతున్నట్టే చెప్పొచ్చు. రామ్మెహన్ రావు టీంకు గుబులు.. తన భర్త యర్రంనాయుడు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన మరిది అచ్చెన్నాయుడి రాజకీయ ఎదుగదల, తన కొడుకు రామ్మోహన్ను పక్కనపెట్టే ప్రయత్నాలను వదిన విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే తరహా రాజకీయాలు కొనసాగితే అచ్చెన్నాయుడు చాటున ఎదుగు బొదుగు లేకుండా ఎన్నాళ్లు ఉంటామన్న గుబులు కింజరాపు రామ్మోహన్ నాయుడు టీంకి పట్టుకుంది. ఈ విషయమై చంద్రబాబు వద్ద పలు మార్లు పంచాయితీ కూడా నడిచింది. ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతికి సొంతూరు నిమ్మాడలో బాబాయ్.. అబ్బాయ్ కుటుంబాల మద్య ఆదిపత్య పోరు బయటపడిందట. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలడం లేదంట. పండక్కి ఇరు కుటుంబాలు ఒక చోట చేరలేదు సరికదా, అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లినవారిని యర్రంనాయుడు కుటుంబం టార్గెట్ చేసి మాట్లాడిందట. అలాగే రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లిన వారిపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారట. బాబాయ్ తప్పుకోవాలని.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్తాను, బాబాయ్ను తప్పుకోమనండి అని అబ్బాయ్ పలువురు తో అచ్చెన్నాయుడు దగ్గరకి రాయబారం పంపిన్నట్టు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి తప్పుకునేది లేదని అచ్చెన్నాయుడు ఫిక్స్ అయిపోవడంతో అబ్బాయ్ చూపు నరసన్నపేట మీద పడిందట. చంద్రబాబుకు కూడా ఇదే ఫిక్స్ చేయమని తన తల్లి విజయలక్ష్మి, పిల్లనిచ్చిన మామ బండారు సత్యన్నారాయణ, అక్క రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిలతో గట్టిగా చెప్పించారు. అయితే చంద్రబాబు ఏ విషయం తేల్చకపోయినప్పటికీ కింజరాపు కుటుంబం మరో ప్రతిపాదన తీసుకొచ్చిందట. అవసరమైతే శ్రీకాకుళం ఎం.పి స్థానానికి యర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానిని బరిలో దింపుతామని, రామ్మోహన్ నాయుడు మాత్రం అసెంబ్లీ స్థానానికే పోటీచేస్తాడని తేల్చి చెప్పారు. ఒకే కుటుంబం నుండి ఒక జిల్లాలో ముగ్గురికి టికెట్ లు ఇస్తే ఎలా అన్నది కింజరాపు కుటుంబం అంటే గిట్టని టిడిపి సీనియర్ బ్యాచ్ లాజికల్ పాయింట్ తీస్తోంది. టిడిపి రాజకీయాలంటే కింజరాపు కుటుంబానిది మాత్రమే కాదు అన్నది వీరి వాదన. దీంతో చంద్రబాబు ఏమీ తేల్చకుండా అలా వదిలేశారు. అయితే అబ్బాయి గట్టిగా పేచీకి దిగితే బాబాయ్ అచ్చెన్నాయుడుని ఎం.పి స్థానానికి ఫిక్స్ చేసి, అబ్బాయిని టెక్కలి అసెంబ్లీ స్థానంలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని శ్రీకాకుళం తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగుతోంది. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Related News by category
-
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు. -
‘అర్బన్ నక్సల్స్’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు
భరూఛ్: ఓటు వేసి అర్బన్ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హితవు పలికారు. గుజరాత్లోని భరూఛ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసావా తరఫున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడారు. ‘‘ మన్సుఖ్లాంటి చక్కని ప్రజా ప్రతినిధి ఇంకొకరు మీకు దొరకదు. పొరపాటున వేరేవాళ్లకు ఓటేస్తే అర్బన్ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీటులో కూర్చుంటారు. ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు. ప్రజలను లూటీచేసేందుకు ఆప్, కాంగ్రెస్ కలిసి వచ్చాయి. కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ.ఓట్లేశాక ఆప్ గిరిజనులను గాలికొదిలేస్తుంది. 400 మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్, కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలు. అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నైపుణ్యం సాధించింది. ఆప్ సర్దార్ స్థాయికి ఎదిగింది. నిజంగానే మేం రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లు అధికారంలో ఉన్నపుడే మార్చేవాళ్లంకదా?’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను మేం ముట్టుకోబోం.ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా. గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) లాగేసుకుంటుందని ఆప్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు. భరూఛ్లో ఆప్ అభ్యర్థి ఛైతర్ వాసావా లేనిపోనివి ప్రచారంచేస్తున్నారు. ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే’’ అని అమిత్ షా చెప్పారు. -
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈసారి మరిన్ని మోసపూరిత హామీలతో ముందుకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఇచ్చిన హామీలకే తాము వెచ్చిస్తున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు అవుతోందని, ఇది నెరవేర్చే అవకాశం లేకపోయినా.. తాను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తానని బాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రతి సందర్భంలోనూ ‘నేను సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తా’ అని చంద్రబాబు అరిచే అరుపుల వెనక మర్మాన్ని ముఖ్యమంత్రి శనివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... జగన్ అబద్ధాలు చెప్పడు... వీళ్లంతా కూడా అబద్ధానికి రెక్కలు కట్టి ఎలా మోసం చేస్తారో తెలియజేయడానికే ఇదంతా చెబుతున్నా. ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలచుకున్నా. నేను చేయలేకపోతే చేయలేనని చెబుతా. అంతే తప్ప అబద్ధాలు ఆడను. మోసం చెయ్యను. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. వేయలేరు కూడా. మేనిఫెస్టోలో లేనివి కూడా... ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో లేని అంశాలెన్నిటినో అమల్లోకి తెచ్చాం. కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద ఇవేవీ 2019 మేనిఫెస్టోలో లేవు. కానీ ఇప్పుడు అమలవుతున్నాయి. అలాగే పిల్లలకు ట్యాబ్లు, ఆరోగ్య శ్రీని రూ.25లక్షలకు పెంచటం, 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటం... ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పకుండానే చేసి చూపించాం. అందుకే చెబుతున్నా. అబద్ధాలు చెప్పి నేను చంద్రబాబుతో పోటీ పడదల్చుకోలేదు. కారణం... అది అబద్ధమని తెలిసి కూడా చెప్పటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగిందే చెబుతా. అవకాశం ఉంటే పేదల కోసం పది అడుగులు ముందుకే వేస్తా. 14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే... జగన్ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను కనుక చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ అంటుంటాడు. అలా తాను చెప్పే అబద్ధాలి్న, చేసే మోసాల్ని నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటాడు. మరి తన 14 ఏళ్ల పాలనలో ఏ సంపద సృష్టించాడు? అసలు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ప్రతి ఏటా లోటే కదా? మరి రెవెన్యూ వ్యయానికే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు? మరి చంద్రబాబు అధికారంలో లేక ముందు గానీ... తర్వాత గానీ ఎప్పుడు చూసినా రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఇదీ వాస్తవం.అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుంది. అంటే లెక్కలన్నీ చంద్రబాబు సంపద సృష్టించలేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలనంతా దోచుకోవడం, దాన్ని పంచుకోవటమే జరిగింది కాబట్టే ఇదంతా. బాబు చేయలేనిది నేను ఎందుకు చేయగలిగానంటే ఇక్కడ కరప్షన్ లేదు. వివక్ష లేదు. అందుకే!. అడ్డగోలు అప్పులు తెచ్చింది బాబేగా? అప్పులపై నోటికొచ్చింది చెబుతున్నారు. కానీ లెక్కలు మారవు కదా? ఎవరెంత అప్పులు చేశారో ఒకసారి గమనిస్తే... 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. మరి ఎక్కువ అప్పులు తెచ్చిందెవరో తెలియటం లేదా? అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గవర్నమెంట్ గ్యారంటీడ్ రుణం... బాబు రాకముందు రూ.14వేల కోట్లు. బాబు దిగిపోయే నాటికి రూ.59వేల కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల రుణాలు రూ.21,367 కోట్ల నుంచి రూ.81,337 కోట్లకు పెరిగాయి. మొత్తంగా అప్పులు బాబు హయాంలో రూ.1,53,346 కోట్ల నుంచి 4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ ప్రభుత్వ హయాలలో చూస్తే ప్రభుత్వ రుణాలు రూ.4.90 లక్షల కోట్లకు, గ్యారంటీడ్ రుణాలు 1.43 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల అప్పులు రూ.69,372 కోట్లకు తగ్గాయి. మొత్తమ్మీద రుణాలు రూ.7,03,471 కోట్లకు చేరాయి. బాబు హయాంలో పెరుగుదల రేటు 21.87 శాతం ఉంటే... ఇప్పుడది 12.13 శాతం. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికుంది? జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందెప్పుడు? పురోగతి అంటే ఏంటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? జీడీపీలో మన రాష్ట్ర వాటా ఎంత? ఇవన్నీ చూడాలి కదా!! వాస్తవానికి చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం ఉంటే.. అది ఇప్పుడు సగటున 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియటం లేదా? ఆస్తుల కల్పన ఎవరి హయాంలో జరిగిందో తెలియటం లేదా? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్రహ్మాండంగా పరుగెత్తుతున్నాయో తెలియటం లేదా? మూలధన వ్యయం... మాటల్లోనేనా? డబ్బులన్నీ పంచేస్తున్నారంటూ చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నాడు. ఎప్పుడైనా తను చెప్పేదొక్కటే. తాను స్కీములకు కాదని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం) రూపంలో ఖర్చు చేశానని. అందుకనే ఇన్ని స్కీములు ఇవ్వలేకపోయానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే... అసలు నాడు–నేడు ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఆసుపత్రులు, స్కూళ్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది? ఆయన హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... మన ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు చేస్తున్నాం. కొత్తగా 4 సీపోర్టులు కడుతున్నాం. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతున్నాం. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుటే జరుగుతున్నాయి. నిజానికి మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ నీడన గడిచిపోయాయి. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద ఇంత భారీగా ఖర్చు చేయగలిగాం. పైపెచ్చు ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ఇదీ జగన్ పనితీరుకు, చంద్రబాబు పనితీరుకు తేడా!. పన్నుల బాదుడులోనూ చంద్రబాబే టాప్... చంద్రబాబు ప్రతిసారీ జగన్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడని. పన్నులతో బాదేస్తున్నాడని అంటున్నారు. కానీ నిజానికి జీఎస్డీపీలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఎవరి హయాంలో ఎక్కువో తెలుసా? చంద్రబాబు నాయుడి హయాంలో జీఎస్డీపీలో ట్యాక్స్ బర్డెన్ 6.57 శాతం. జగన్ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లలో చెప్పినవే కదా? -
కళింగ యుద్ధం!
పోలింగ్ తేదీలు: మే 13, 20, 25, జూన్ 1సర్వేలు ఏం చెబుతున్నాయి... బీజేడీకి 11, బీజేపీకి 10 లోక్సభ స్థానాలు రావొచ్చని సర్వేలు అంచనా వేశాయి. అసెంబ్లీలోనూ బీజేపీ–బీజేడీ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చని అంచనా. బీజేడీనే అధికారాన్ని నిలబెట్టుకున్నా బీజేపీకి 60 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఒడిశాలో పాతికేళ్లుగా బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నయక్ ఏకఛత్రాధిపత్యం సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిసారీ మెజారిటీ స్థానాలు బీజేడీకే దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్రంలో పాగా వేసేందుకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ‘కళింగ’ యుద్ధంలో ఈసారి మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఒడిశాలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేడీకి ఊహించని షాక్ తగిలింది. మొత్తం 21 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లకే పరిమితమైంది. 8 సీట్లు కోల్పోయింది. బీజేపీ కూడా ఒంటరిగా బరిలో నిలిచి 8 స్థానాలు కొల్లగొట్టింది! 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న కాషాయ పార్టీ ఏకంగా 7 సీట్లను పెంచుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పూర్తిగా చేతులెత్తేసింది. కాంగ్రెస్ 18 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జేఎంఎం సున్నా చుట్టాయి. నవీన్ మ్యాజిక్... సీఎంగా, కేంద్ర మంత్రిగా వెలుగు వెలిగిన బిజూ పట్నయక్ కుమారుడైన నవీన్ 1997లో జనతాదళ్ను వీడారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పేరుతో పార్టీ పెట్టి తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒడిశా అంటే నవీన్ పట్నయక్ అనే స్థాయిలో పాతికేళ్లుగా పాతుకుపోయారు. వరుసగా ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా కొనసాగుతున్న రెండో వ్యక్తిగా (సిక్కింలో పవన్ చామ్లింగ్ తర్వాత) నిలిచారు. తొలుత కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చేరిన నవీన్ వాజ్పేయి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మెజారిటీ సీట్లను గెల్చుకుని తొలిసారి ఒడిశా సీఎం అయ్యారు. నాటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 2004లో ఎన్డీఏ కేంద్రంలో అధికారం కోల్పోయినా ఒడిశాలో మాత్రం నవీన్ జోరు తగ్గలేదు. 2008లో కొంధొమాల్ జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని వీడారు నాటినుంచీ ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తున్నారు. లోక్సభ పోరులో తడబాటు 2019లోనూ ఒడిశాలో జమిలి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో 147 స్థానాలకు 112 చోట్ల నెగ్గిన బీజేడీ లోక్సభ పోరులో 12 సీట్లకు పరిమితమైంది. అనూహ్యంగా 8 సీట్లకు ఎగబాకిన బీజేపీ, అసెంబ్లీలో కూడా బలాన్ని 10 నుంచి 23 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కేవలం 9 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీఏకు దూరంగా ఉన్నా పార్లమెంట్లో పలు కీలక బిల్లులపై ఎన్డీఏకు బీజేడీ మద్దతు కొనసాగిస్తూనే ఉంది! 15 ఏళ్ల తర్వాత నవీన్ మరోసారి ఎన్డీఏలో చేరేలా కని్పంచినా చివరికి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాను నవీన్ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అభివృద్ధే మా నినాదం, గుర్తింపు. దీనికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయి. అభివృద్ధి నిరోధకులుగా మారాయి. వాటి అసలు రంగేమిటో ఒడిశా ప్రజలకు తెలుసు. వచ్చే పదేళ్లను ‘ఒడిశా దశాబ్ది’గా మార్చి చూపిద్దాం. 2036 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నంబర్వన్గా నిలిపేందుకు పునరంకితమవుదాం. – హింజిలిలో ఎన్నికల ప్రచార ప్రారంభం సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశాలో రాష్ట్రాన్ని నడుపుతున్నది అధికారులే. బీజేడీ ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది. అపారమైన ఖనిజ వనరులున్నా రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. నవీన్ పట్నయక్కు పాతికేళ్లు అధికారం కట్టబెట్టారు. మాకు ఐదేళ్లు అవకాశమివ్వండి. 20 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. – సోనేపూర్ ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి పోటీ ఇచ్చేనా...! కాంగ్రెస్ పరిస్థితి ఒడిశాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నాయకత్వం లేమితో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండింట్లోనూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈసారి కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ఆశ పడుతోంది. ఒడిశాలో 93 శాతం హిందువులే. 3 శాతం క్రైస్తవులు, 2.5 శాతం మేర ముస్లింలున్నారు.హిందూ జనాభాలో 40 శాతం ఆదివాసీలు, దళితులు. వీరిలో ఎస్టీలు 23 శాతముంటారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త కులగణన అస్త్రం ఒడిశాలో బాగా కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తోంది. మోదీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు అంశాలను కూడా గట్టిగా ప్రచారం చేస్తోంది. బీజేపీలోకి వలసల జోరు బీజేపీకి ఒడిశాలో ఒకప్పుడు సరైన ప్రాతినిధ్యమే లేదు. అలాంటిది ఇప్పుడు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే స్థాయికి చేరింది. మోదీ ఫ్యాక్టర్తో పాటు అభివృద్ధి ఎజెండా, రామమందిర అంశంతో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈసారి ఎంపీ సీట్లను రెండంకెలకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేడీ నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటుండటం విశేషం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత అరబింద ధాలి బీజేపీలో చేరారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బల్లగుద్ది చెబుతున్నారు! కటక్ నుంచి వరుసగా 6 సార్లు ఎంపీగా గెలిచిన బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆ పార్టీ టికెట్పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ఒడిశా తొలి సీఎం కృష్ణహరి మహతాబ్ కుమారుడు. బీజేడీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సిద్ధాంత్ మహాపాత్ర కూడా కాషాయ జెండా కప్పుకున్నారు. ఆయన బరంపురం నుంచి బీజేడీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కీలక నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి సంభాల్పూర్ నుంచి బరిలోకి దిగారు. ఆయనను బీజేడీలో నంబర్ టూగా వెలుగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రణబ్ ప్రకాశ్ దాస్ ఢీకొంటున్నారు. దాంతో సంభాల్పూర్ హాట్ సీట్గా మారింది. -
మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్
విశాఖ సిటీ: ‘మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వం. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా నెరవేర్చాం. తాజాగా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని, మరింతగా ప్రజోపయోగమైన అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ 2024 మేనిఫెస్టో రూపొందించారు.రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఆమోదించి, మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలి’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు నిక్కచ్చిగా, కచ్ఛితంగా ఏదైతే చేస్తామని చెప్పారో, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దళారులు, మధ్యవర్తులు లేకుండా రూ.2.7 లక్షల కోట్లు నేరుగా పేద ప్రజలకు అందించారని తెలిపారు. దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో 99 శాతం అమలు చేయలేదని, ఒక్క సీఎం వైఎస్ జగన్కి మాత్రమే అది సాధ్యమైందని, దేశ రాజకీయాల్లో కొత్త రికార్డులు నెలకొల్పి ఈ రోజు మీ ముందుకు వచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని చెప్పారు. విద్య, వైద్యాన్ని ఒక పెట్టుబడిగా చూస్తున్నామన్నారు.మూడు రాజధానులు మా అజెండారాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించారని తెలిపారు. ఇదే తమ అజెండా అని చెప్పారు. దీనిని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లగలరా అని కొందరు ప్రశ్నించారని, ఇప్పుడు అదే రెఫరెండంగా మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళుతున్నామని చెప్పారు. విశాఖను ప్రపంచంలో మేటి నగరంగా తయారు చేయడానికి సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇక్కడ ఐటీ హబ్, డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రజల కోసం అర్బన్ లేఅవుట్లు డెవలప్ చేసి గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు కాస్ట్ టు కాస్ట్కు ఇళ్లు ఇవ్వడంపై దృష్టి పెడతామన్నారు.అవుట్ సోర్సింగ్లకు తీపి కబురుఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదాయ పరిమితి పెట్టడంతో నవరత్నాలు అందడంలేదన్న ఉద్యోగ సంఘాల వినతిని తాము సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని రూ.25 వేలు వరకు జీతాలున్న వారందరూ అర్హులని మేనిఫెస్టోలో చేర్చడం చాలా పెద్ద విషయమన్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. విద్యా శాఖలో ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నో వెకెన్సీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏ ఏడాది ఖాళీ ఏర్పడితే అదే ఏడాది భర్తీ చేసే విధానాన్ని తేవాలని చూస్తున్నామన్నారు.బాబు మోసకారి.. టీడీపీ నక్కల పార్టీచంద్రబాబు మోసకారి అని, టీడీపీ నక్కల పార్టీ అని బొత్స వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశాడన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనీ అమలు చేయలేదని, మేనిఫెస్టోనే మాయం చేశారని చెప్పారు. బాబు రూ.4 వేలు పెన్షన్ ఇస్తానన్నా ఎవరు నమ్మరని అన్నారు. 2019లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన నాటికి మహిళలకు ఎంత రుణం ఉందో అంతటినీ ముఖ్యమంత్రి జగన్ మాఫీ చేశారని గర్వంగా చెబుతున్నామని అన్నారు.నాడు స్నోలు, పౌడర్లకు మూల ధన వ్యయంటీడీపీ హయాంలో మూల ధన వ్యయం ఏడాదిలో రూ.15,227 కోట్లు మాత్రమే కేటాయించి, దానిని కూడా స్నోలు, పౌడర్లకు దుబారా ఖర్చు చేశారన్నారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆస్పత్రులు, నాడు–నేడు, వెల్నెస్ సెంటర్ల కోసం ఏటా రూ.17,757 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇది మైనస్ రూ.366 కోట్లుగా ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే అప్పులు తెచ్చామని, ఇదీ జగన్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement