లాఠీ విసరడంతో మహిళ మృతి | women dies after police hits with lotty | Sakshi
Sakshi News home page

లాఠీ విసరడంతో మహిళ మృతి

Jan 12 2016 10:33 PM | Updated on Apr 3 2019 8:07 PM

మోటార్ బైక్ పైకి పోలీసు లాఠీ విసరడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

యాడికి (అనంతపురం): మోటార్ బైక్ పైకి పోలీసు లాఠీ విసరడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కుందన కుంటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్ పైన అత్తా అల్లుడు వెళుతుండగా ఎక్సైజ్ పోలీస్ లాఠీ విసిరాడు. బైక్ పై నుంచి కింద పడి అత్త బసమ్మ (50) మృతి చెందగా, అల్లుడు వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement